12వ తారీఖు బుదారం పొద్దుగాల 10 కొట్టంగనే తెలంగాణా అసెంబ్లీ షురువైంది.షురు కాంగనే ప్రశ్నోత్తరాలను సభ అందుకుంది.కల్తీ పాలకు సంబంధించిన దాని మీద సభ మంచిగనే ఏం లొల్లి లేకుండ జర్గుతంటే,రవీందర్ రెడ్డి తన ప్రశ్న ప్రభుత్వాన్ని అడిగిండు.కేరళ రాష్ట్రంల హెరిటేజ్ పాల మీద నిషేధం ఉంది,మరి గీ దాన్మీద మంత్రిగారి స్పందిన్చాలే అని అన్నడు.
ఆరోగ్య శాఖ మంత్రి డా.రాజయ్య, గా ప్రశ్నకు సమాధానం సేప్తూ కేరళల హెరిటేజ్ పైన నిషేధం ఉన్న సంగతి మాకు తెల్సింది.ఆహార నాణ్యత,ప్రమాణాల చట్టం ప్రకారం నమూనాలను చూసి చర్య తీసుకుటం అనంగనే,ఇగ టీడీపీ ఎమ్మెల్యేలు లేసి లొల్లి సేయబట్టే.గింతల్నే మంత్రి కేటీఆర్ మాట్లాడ్తూ హెరిటేజ్ గీల్ల సొంతమైనట్టు ఒకటే లొల్లి సేయబడతార్రు.చంద్రబాబు నామినేటెడ్ సభ్యుల్లాగా తెలంగాణా సభల టీడీపొల్లు సేత్తార్రు అని మస్తు కోపానికోచ్చిండు.టీడీపి ఎమ్మెల్యేలు లొల్లి లొల్లి సేస్తంటే స్పీకర్ సభను రెండు సార్ల పది పది నిమ్శాలు వాయిదా వేసిండు.
Post a Comment