0
సిగరెట్లు తాగేటోల్లకు గిది బ్యాడ్ న్యూస్.సిగరేట్ తాగాలని కుతి లేసిందో అట్ల పాన్ డబ్బ దగ్గర్కు ఎల్లడం ఒక సిగరేట్ కొన్కొని కుతి తీర తాగడం,నోట్ల ఒక వొక్క పొట్లం ఏసుకొని శిన్నగ ఇంటికి పోవడం.ఇంట్ల తెల్యకుంట శానా మంది బయటే సిగరేట్ తాగి ఇంటికి పోయేటోల్లకు ఐతే గిది నిజంగా బాడ్ న్యూసే.ఎంద్కంటే సిగరేట్ తాగాలని కుతి లెత్తే ఒకటి కొన్కొని తాగి ఇంటికి పోనీకి ఉండద్.కొంటె సిగరేట్ డబ్బ కొనాల్సిందే.
ఇయ్యాల ఆరోగ్య శాఖ మంత్రి జెపీ జడ్డ పొగాకు ఉత్పత్తుల పై ఏర్పాటైన కమిటీ సిఫారసులను అమలు సేత్తమని రాజ్యసభల మంత్రి గారు చెప్పిర్రు.గట్ల రాజ్యసభల మంత్రి ప్రకటన చేసిర్రో లేదో పొగాకు కంపెనీల షేర్లు డబీల్మని పడిపోయినయ్.కమ్సేకం 10శాతం దాంక పడిపోయినయ్.
70 శాతం దాంక సిగరెట్లు కుల్లనే అమ్ముడుపోతయంట.సిగరేట్ ప్యాకెట్ కొనాల్నంటే రూ.190 ఖర్చు చెయ్యాల్నంటే మిడిల్ క్లాసోల్లకు కష్టమే కదా.పొగాకు కంపెనీలు గీ రూల్ తీసుకొస్తే నష్టాలకు బాట పడ్తయని,గట్లనే సిగరేట్ డబ్బే దగ్గరుంది కదని సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతరు అని అంటున్నర్రు అనలిస్టులు.జేబులకు శిల్లులు,ఆరోగ్యం మరింత కరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నయని కూడా అంటున్నరు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top