0
తెలంగాణా శాసనసభల మంగళారం కూడా లడాయి తగ్గేటట్టు కన్పించట్లేదు.10 కొట్టంగనే సభ షురూ అయింది.సభ షురూ కాంగనే కాంగ్రేస్ పార్టీ ఫిరాయింపులపై చర్చించాలే అని స్పీకర్ పోడియాన్ని కమ్మేసింది.
ప్రతిపక్ష నేత జానా రెడ్డి మాట్లాడ్తూ గతంలో మేం కూడా వేరే పార్టీ వాళ్ళను చేర్చుకున్నం కాని గింట్ల చేర్చుకోలే అనంగనే శాసనసభ యవారాల మంత్రి హరీష్ రావు మాట్లాడ్తూ స్పీకర్ పరిధిల ఉన్న విషయాన్ని చర్చించడం సరికాదు.ఇప్పట్కే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది,రాజశేఖర్ రెడ్డి సీఎం గ ఉన్నప్పుడు జానారెడ్డి మంత్రి గ ఉండు మరెందుకు గప్పుడు మాట్లడలే అని మాట్లాడిండు హరీష్.కాంగ్రేసోల్లు మాత్రం లొల్లి ఆపలే,దాన్తోని హరీష్ రావు మాట్లాడ్తన్టనే స్పీకర్ సభను 10 నిమ్షాలు వాయిదా ఏసిండు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top